బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అవమానం
x
Highlights

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు అవమానం జరిగింది. మోడీకి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన కన్నాకు విమానాశ్రయంలోకి...

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు అవమానం జరిగింది. మోడీకి స్వాగతం పలికేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన కన్నాకు విమానాశ్రయంలోకి పోలీసులు అనుమతించలేదు. లిస్టులో పేరు లేందంటూ అనుమతి నిరాకరించారు. దీంతో కన్నా స్పందిస్తూ..'నేను మోదీ గారితో కలిసి హెలికాప్టర్ లో గుంటూరుకు వెళ్లాల్సి ఉంది. దయచేసి అనుమతించండి' అని కోరినా అధికారులు అంగీకరించలేదు. ఈ ఘటనపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా బీజేపీ శ్రేణులు గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మోదీని ఆహ్వానించడానికి గన్నవరం విమానాశ్రయానికి గవర్నర్ నరసింహన్ చేరుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories