టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు
x
Highlights

గురువారం లోక్‌సభ ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. కాగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓటింగ్ సందర్భంగా...

గురువారం లోక్‌సభ ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. కాగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఓటింగ్ సందర్భంగా జరిగిన గొడవలో కాలేరు వెంకటేష్‌ తనను దుర్భాషలాడారని యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రంజిత్‌రెడ్డి కాచిగూడ పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కాగా రంజిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉంటే కులం పేరుతో బీజేపీ నేతలు తనను దూషించారని టీఆర్‌ఎస్‌ నేత దుర్గరాజు కాచిగూడ పోలీస్ ఠాణాలో మరో ఫిర్యాదు చేశాడు. అయితే బీజేపీ నేతలు రంజిత్‌రెడ్డి, నందుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీఐ జానకిరెడ్డి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories