రేపు నంద్యాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రేపు నంద్యాలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్
x
Highlights

ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన తరువాత జససేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాకు ఇంటర్వూలు, ప్రెస్ మీట్ లాంటివి ఏమీ కూడా లేకుండా కస్తా విరామం ఇచ్చారు. ఎన్నికల...

ఏపీలో ఎన్నికల సమరం ముగిసిన తరువాత జససేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాకు ఇంటర్వూలు, ప్రెస్ మీట్ లాంటివి ఏమీ కూడా లేకుండా కస్తా విరామం ఇచ్చారు. ఎన్నికల హడావిడి ముగియడంతో ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఈనెల 11న అంటే రేపు నంద్యాలలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇటివలే కన్నుమూసిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి పవన్ నివాళులు అర్పించి తరువాత కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ స్థానం నుండి ఎస్పీవై రెడ్డి పోటి చేశారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి (69) మే 1న కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories