యుద్ధంతో ఇరుదేశాలకు నష్టమే: జనసేనాని

యుద్ధంతో ఇరుదేశాలకు నష్టమే: జనసేనాని
x
Highlights

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో యుద్ద వాతావరణమే నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే యుద్ధం అంటూ జరిగితే మాత్రం ఇరు...

దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిల్లో యుద్ద వాతావరణమే నెలకొని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అయితే యుద్ధం అంటూ జరిగితే మాత్రం ఇరు దేశాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. దేశంలో ఉగ్రవాదం విచ్చలవిడిగా మారిందన్నారు. తాజాగా 40 మంది మన దేశ జవాన్లు బలికావడం బాధాకరమని పవన్ అన్నారు. మన దేశ పైలెట్ పాకిస్థాన్ సైన్యం చేతికి చిక్కడం నిజంగా కలవరపాటుకు గురిచేస్తోందని పవన్ కళ్యాణ్ తెలిపారు. పైలెట్ అభినందన్ క్షేమంగా మన దేశానికి తిరిగిరావాలని పవన్ ఆకాంక్షించారు. జెనీవా నిబంధనలను పాక్ పాటించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories