యూరప్ టూర్ ముగించుకుని విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్ వచ్చీరాగానే కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికలకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
యూరప్ టూర్ ముగించుకుని విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్ వచ్చీరాగానే కీలక ప్రకటన చేశారు. 2019 ఎన్నికలకు ఇప్పట్నుంచే సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయవాడ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించిన పవన్ వంద రోజుల ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలని జనసైనికులకు సూచించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో ప్రచారంపై దృష్టిపెట్టారు. యూరప్ టూర్ ముగించుకుని విజయవాడ వచ్చిన పవన్ కల్యాణ్ జనసేన కార్యాలయంలో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. విజయవాడ నుంచి 2019 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలన్న పవన్... పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మనమందరం కష్టపడదాం, నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దాం, జనసేనను గెలిపించుకుందాం, ఏపీ బంగారు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిద్దామంటూ పార్టీ శ్రేణులకు జనసేనాని సందేశమిచ్చారు.
ఉత్తరాంధ్రతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటికే పోరాట యాత్ర కంప్లీట్ చేసుకున్న పవన్... మిగతా ఏడు జిల్లాల్లో కూడా వేగంగా పర్యటనలు చేయనున్నారు. వంద రోజుల ప్రణాళికతో రాష్ట్రమంతా చుట్టేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లడంతోపాటు టీడీపీ, వైసీపీ కంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire