ఒడిశా సీఎం సంచలన నిర్ణయం..

ఒడిశా సీఎం సంచలన నిర్ణయం..
x
Highlights

సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటాను అమలు చేయాలన్న ప్రతిపాదన...

సార్వత్రిక ఎన్నికల ముందు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చట్టసభల్లో మహిళలకు 33శాతం కోటాను అమలు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం లోక్‌సభ ఎన్నికల టికెట్ల కేటాయింపులో 33శాతం రిజర్వేషన్లు మహిళలను కేటాయిస్తున్నట్లు నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఆదివారం కెండార్పర ఎన్నికల సభలో పాల్గొన్న నవీన్ పట్నాయక్‌ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. దీంతో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన దేశంలో తొలి రాష్ట్రంగా ఒడిశా నిలిచింది. దీంతో 33శాతం ఎంపీ టికెట్లను​ మహిళకే కేటాయించనున్నారు. ఈ ప్రకటనపై హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories