సస్పెన్స్ కు తెరపడింది

సస్పెన్స్ కు తెరపడింది
x
Highlights

ఎట్టకేలకు సస్పెన్స్ విడిపోయింది. తెలంగాణా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గా ఎవరు నిలుస్తారని జరుగుతున్నప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్...

ఎట్టకేలకు సస్పెన్స్ విడిపోయింది. తెలంగాణా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి గా ఎవరు నిలుస్తారని జరుగుతున్నప్రచారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్ రావు పేరును పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. గత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి, నవీన్ రావుకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ప్రస్తుతం ఒకే ఖాళీ ఏర్పడటంతో నవీన్ రావుకు అవకాశం కల్పించారు. త్వరలో ఏర్పడే మూడు ఎమ్మెల్సీ ఖాళీలలో గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.

అయితే, ఈ ఎమ్మెల్సేయే స్థానాన్ని సుఖేంద్ర రెడ్డికి కేటాయిస్తారని రెండు రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ నవీన్ రావు కు అవకాశం కల్పించడం తో ఆ ప్రచారాలకు బ్రేక్ పడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories