టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రత్యర్థుల...
టీడీపీలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ప్రత్యర్థుల అడ్డంకుల్ని పోటాపోటీగా ఎదుర్కొన్నామన్నారు. టీడీపీకి, రాష్ట్రానికి నష్టం చేయాలని ప్రధాని మోడీ చేయని ప్రయత్నం లేదని దుయ్యబట్టారు. టీడీపీకి నష్టం చేయాలని తెలంగాణ సీఎ కేసీఆర్ అనేక ప్రయత్నాలు చేశారని, జగన్ కుట్రలకు మోడీ, కేసీఆర్ కుతంత్రాలు తోడయ్యాయని ధ్వజమెత్తారు.
ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులతో సమీక్ష సందర్భంగా ఆయన మోడీ, జగన్, కేసీఆర్పై ఫైర్ అయ్యారు. పోటీకి అభ్యర్థులు లేనప్పుడు సర్వేలతో మైండ్గేమ్ ఆడారని మండిపడ్డారు. ఇక ప్రమాణ స్వీకార ముహూర్తం, మంత్రి పదవులు మైండ్గేమ్లో భాగమేనన్నారు చంద్రబాబు. వీళ్లకు తోడు మాస్టర్ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తోడయ్యాడని ఆరోపించారు. ''హింస, విధ్వంసాలకు స్కెచ్లు వేసి అమలు చేశారని, ఓటింగ్ శాతం తగ్గించే కుట్రలు చేశారని మండిపడ్డారు చంద్రబాబు.
టీడీపీ నేతలను బెదిరింపులకు గురి చేశారన్న చంద్రబాబు.. రాబోయే ప్రతి ఎన్నికలోనూ మనమే గెలవాలన్నారు. ప్రతి కార్యకర్త పొలిటికల్ ఇంటెలిజెన్స్ పెంచుకోవాలని, 110 బహిరంగసభలు, రోడ్ షోలు చేసినట్టు చెప్పారు. ప్రతిపక్ష నేత 60-70 సభలు పెట్టలేకపోయారని విమర్శించారు చంద్రబాబు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఊళ్లకు వెళ్తే నిలదీశారన్న చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యేలపై పనులు చేయలేదనే అసంతృప్తి లేదన్నారు. ఏపీలో ఓటేసేందుకు రాకుండా కేసీఆర్ అడ్డుకున్నారని, ఈ ఎన్నికల్లో ఎంతోమంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని చెప్పుకొచ్చారు. కేసుల మాఫీ, పదవి కోసమే వైపీపీ పోరాటం చేస్తోందని, వచ్చే రెండు, మూడు సీట్లకు జగన్ బేరాలు ప్రారంభించారని మండిపడ్డారు చంద్రబాబు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire