మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపించిన ఆటోవాలా..

మానవత్వాన్ని మించిన మతం లేదని నిరూపించిన ఆటోవాలా..
x
Highlights

ఆ ప్రాంతంలో మతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. పదిహేను మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ ప్రభుత్వం కర్ఫ్యూ విధించారు....

ఆ ప్రాంతంలో మతాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఘర్షణల్లో ఒకరు చనిపోయారు. పదిహేను మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. అక్కడ ప్రభుత్వం కర్ఫ్యూ విధించారు. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో ఓ హిందూ మహిళకు ప్రసవ వేదన మొదలైంది. ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు ఆంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాలేమని చేతులెత్తేశారు వాళ్ళు. దీంతో ఎం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా అపుడే ఓ ముస్లిం యువకుడు దేవునిలా వచ్చాడు. తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. ఆసుపత్రికి సకాలంలో చేర్చాడు. ఒక పక్క మతాల కొట్లాటలతో నలిగిపోతున్న ప్రాంతంలో మానవత్వం కంటే మించిన మతమేదీ లేదని నిరూపించిన సంఘటన ఇది.

మత ఘర్షణల కారణంగా అసోంలోని హైలాకండీలో కర్ఫ్యూ విధించారు.రుబెన్‌ దాస్‌ అనే వ్యక్తి తన భార్య నందిత పురిటి నొప్పులతో బాధపడుతుండడం చూసి అంబులెన్స్‌ కోసం ప్రయత్నించాడు. అయినప్పటికీ, తమకు సాయం అందకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆయన బాధపడిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆటో డ్రైవర్ మక్బూల్‌.. వెంటనే తన ఆటోలో నందితను సరైన సమయానికి ఆస్పత్రికి చేర్చాడు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చుట్టూ ఉన్న వారు మతాల కోసం ఘర్షణ పడుతుంటే ఆ ఆటోడ్రైవర్‌ మాత్రం హిందూ మహిళను సాయం చేసి హీరో అయ్యాడు.

ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లీ నందిత వద్దకు వచ్చి ఆమె పరిస్థితి తెలుసుకున్నారు. 'హిందూ-ముస్లిం సామరస్యాన్ని చాటే ఇటువంటి ఉదాహరణలు మరిన్ని వెలుగులోకి రావాలి' అని అన్నారు. కర్ఫ్యూ ఉన్న సమయంలోనూ సాహసోపేతంగా ఆమెను ఆస్పత్రికి చేర్చిన ఆటోడ్రైవర్‌ను ప్రత్యేకంగా కలిసి ప్రశంసించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories