ఏపీ కి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తాం

ఏపీ కి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తాం
x
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏపీ కి సంబంధించిన పలు విషయాలపై ఫలవంతమైన చర్చలు జరిపాము. కేంద్రం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి తో అద్భుతమైన సమావేశం జరిగింది. ఏపీ కి సంబంధించిన పలు విషయాలపై ఫలవంతమైన చర్చలు జరిపాము. కేంద్రం నుంచి ఆంధ్రాకు అవసరమైన అన్ని రకాల సహాయం అందచేస్తాం అని ప్రధాని మోడీ ట్విటర్ లో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ నెల 30 న ప్రమాణస్వీకారం చేయనున్న వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండోసారి ప్రధానిగా ఎన్నికైన మోడీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన ప్రమాణ స్వీకార ఉత్సవానికి హాజరు కావాల్సిందిగా మోడీ ని జగన్ ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఇరువురి మధ్య దాదాపు గంట పాటు చర్చలు సాగాయి. ఏపీ కి ప్రతీక హోదా తదితర అంశాలు వీరి మధ్యలో చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories