తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
x
Highlights

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసింది. టీఆర్ఎస్ కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎంకు చెందిన ఏడుగురు, ఒక నామినేటెడ్...

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసింది. టీఆర్ఎస్ కు చెందిన 90 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంఐఎంకు చెందిన ఏడుగురు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తొలి ఓటు వేయగా సీఎం కేసీఆర్ చివరి ఓటు వేశారు. ఇరువురు నేతలు శేరి సుభాష్ రెడ్డికే వేశారు. కాంగ్రెస్, టీడీపీలు ఓటింగ్ ను బహిష్కరించినట్టు ప్రకటించాయి. మొత్తం 98 ఎమ్మెల్యేల్లో ముగ్గురు అభ్యర్ధులకు 20 మంది చొప్పున తొలి ప్రాధాన్యత ఓటు వేయగా మిగిలిన ఇద్దరు అభ్యర్ధులకు 19 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వేశారు. తాజా పరిణామాల నేపధ్యంలో టీఆర్ఎస్ తో పాటు ఎంఐఎంకు చెందిన ఐదుగురు అభ్యర్దుల విజయం దాదాపు ఖాయమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories