తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌ చేపడతారు

తెలంగాణ టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్‌ చేపడతారు
x
Highlights

చాలా రోజుల నుండిఅశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ పార్టీని వీడుతున్నట్లు జోరుగా వార్తాలు వచ్చాయి. అయితే ఈ వార్తాలపై మెచ్చా...

చాలా రోజుల నుండిఅశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ పార్టీని వీడుతున్నట్లు జోరుగా వార్తాలు వచ్చాయి. అయితే ఈ వార్తాలపై మెచ్చా నాగేశ్వరరావు తాను ఎట్టిపరిస్థితిల్లోనూ టీడీపీ పార్టీ వీడే ప్రసక్తలేదని స్పష్టం చేశారు. రాబోయే రెండేళ్లలో తెలంగాణ టీడీపీ పగ్గాలను ప్రముఖ సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ చేపట్టనున్నారని నాగేశ్వరావు వెల్లడించారు. మళ్లీ టీడీపీ పార్టీకి పూర్వవైభం సాధిస్తుందని ఆశభావం వక్తం చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని నాగేశ్వరావు వ్యాఖ్యానించారు. అయితే టీఆర్ఎస్ నేతలను కలిసిన మాట వాస్తవమేనని కానీ వారీకి ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ వీడబోనని చెప్పాను అని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీడీపీని వీడినంత మాత్రాన కిందిస్థాయి కార్యకర్తలెవరూ పార్టీ మారే పరిస్థితి లేదన్నారు. వచ్చే రెండేళ్లలో ఎన్టీఆర్‌ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రానున్నారని టీడీపీ తరఫున తెలంగాణ వ్యాప్తంగా ఆయన పర్యటిస్తారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories