కామాంధుల చేతిలో దళిత బాలిక అత్యాచారం .. 12 గంటలు రాక్షసానందం

కామాంధుల చేతిలో దళిత బాలిక అత్యాచారం .. 12 గంటలు రాక్షసానందం
x
Highlights

కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు . వాళ్ళ సైకో తత్వానికి ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు . ఇలాంటి సంఘటనే తెలంగాణా జిల్లాలోని సిద్దిపేటలో చోటు...

కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు . వాళ్ళ సైకో తత్వానికి ఎంతో మంది అమ్మాయిలు బలి అవుతున్నారు . ఇలాంటి సంఘటనే తెలంగాణా జిల్లాలోని సిద్దిపేటలో చోటు చేసుకుంది . పదహారేళ్ల దళిత బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు 12 గంటలు నరకం చూపారు.

సిద్దిపేట జిల్లా జగ్దేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామానికి చెందిన దళిత బాలికకు ఓ యువకుడు స్నేహం పేరుతో దగ్గరయ్యాడు. దీంతో ఆ బాలిక అతడితో తరుచూ మాట్లాడుతుండేది. బుధవారం సాయంత్రం ఆ బాలికను కలిసిన యువకుడు బైక్‌పై షికారుకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న తన స్నేహితులు ముందుగానే కపుకాసారు. బాలికను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు . అక్కడ ముగ్గురు యువకులు ఆ బాలికపై ఒకరు తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.

దాదాపుగా 12 గంటల పాటు ఆమెను రేప్ చేసారు . తనను వదిలేయమని అ బాలిక ఎంత వేడుకున్నా వాళ్ళు కనికరం చూపించలేదు. వారి కామానికి బలైపోయిన బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో గురువారం ఉదయం రాజీవ్ రహదారిపై పడేసి వెళ్లిపోయారు. అప్పటికే బాలిక కోసం వెతుకుతున్న కుటుంబసభ్యులు దారుణ పరిస్థితిలో అ బాలికను చూసి చలించిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలిక కాస్త కోలుకున్నాక ఆరా తీయగా తనపై జరిగిన అఘాయిత్యాన్ని చెప్పింది . దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories