శ్రీవారిని దర్శించుకున్న మాండ్యా ఎంపీ సుమలత

శ్రీవారిని దర్శించుకున్న మాండ్యా ఎంపీ సుమలత
x
Highlights

అలనాటి నటి, కర్నాటకలో ని మాండ్యా పార్లమెంట్ సభ్యురాలు సుమలత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపీగా గెలుపొందిన తరువాత తొలి సారి స్వామి వారిని...

అలనాటి నటి, కర్నాటకలో ని మాండ్యా పార్లమెంట్ సభ్యురాలు సుమలత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపీగా గెలుపొందిన తరువాత తొలి సారి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీవారి ఆశీస్సులు, ప్రజల దీవెనలతోనే పార్లమెంట్‌లో తొలిసారి అడుగు పెడుతున్నానని ఆమె అన్నారు. తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన మాండ్యా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని ఆమె ప్రకటించారు. వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సుమలతకు ఆలయ పండితులు తీర్ధ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories