వారికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయం చేయాలి: మందకృష్ణ

వారికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయం చేయాలి: మందకృష్ణ
x
Highlights

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్వాల జిల్లా రామాపురానికి చెందిన మృత్యువాత పడ్డ కుటుంబాలను ఎమ్మర్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ ...

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గద్వాల జిల్లా రామాపురానికి చెందిన మృత్యువాత పడ్డ కుటుంబాలను ఎమ్మర్పీఎస్‌ అధినేత మందకృష్ణ మాదిగ పరామర్శించారు. రోడ్డు ప్రమాదంలో ఇంత మంది చనిపోయినా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరామర్శించకపోవడంపై మండిపడ్డారు. కర్నూలు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 నుంచి 15 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. గతంలో బియాస్ నదిలో విద్యార్థులు చనిపోయినప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందించాయో ఇప్పుడు కూడా అలానే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయం అందించాలని కోరుతున్నారు. అలాగే మృతుల కుటుంబాలకు 3 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు మందకృష్ణ మాదిగ.

Show Full Article
Print Article
Next Story
More Stories