జెండా ఎగరేసే విషయంలో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం

జెండా ఎగరేసే విషయంలో ఇద్దరు టీఆర్‌ఎస్ నేతల మధ్య వాగ్వాదం
x
Highlights

రిపబ్లిక్ డే రోజు జాతీయ భావాన్ని, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాల్సిన నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు జెండా...

రిపబ్లిక్ డే రోజు జాతీయ భావాన్ని, దేశభక్తిని ప్రజల్లో పెంపొందించాల్సిన నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు జెండా నేను ఎగరేస్తానంటే నేను ఎగరేస్తానంటూ గొడవపడ్డారు. జెండా పట్టుకుని ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ నేతల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు.

మంచిర్యాల జిల్లా అరుణక్క నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంచిర్యాల _3 ఎంపీటీసీ రవీందర్ తన ప్రాంతంలో కాకుండా మంచిర్యాల -2 ఎంపీటీసీ ప్రాంతంలో జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు. దీంతో మంచిర్యాల -2 ఎంపీటీసీ తిరుపతి రవీందర్‌ను అడ్డుకున్నారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఆ ఇద్దరు నేతల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories