నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. దారుణం

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా.. దారుణం
x
Highlights

మెదక్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉన్న సమయం, అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి...

మెదక్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఉన్న సమయం, అందరూ చూస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రుద్రారం ముంబై హైవేపై మహమూద్‌ అనే వ్యక్తిని ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దారుణంగా నరికి చంపారు. పట్టపగలు, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ దారుణం చోటుచేసుకుంది. ఐదు నెలలక్రితం లక్డారంలో జరిగిన హత్యకేసులో మహమూద్‌ నిందితుడు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరినట్లు తెలుస్తోంది. హత్య చేసిన వారు పాత నేరస్తులేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories