కేసీఆర్‌కు మమతా ఫోన్: కోల్‌కత్తా ర్యాలీకి డౌటే

కేసీఆర్‌కు మమతా ఫోన్: కోల్‌కత్తా ర్యాలీకి డౌటే
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కోల్ కతా రేపటి యునైటెడ్ ఇండియా ర్యాలీపై చర్చించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేశారు. రేపు కోల్ కతా రేపటి యునైటెడ్ ఇండియా ర్యాలీపై చర్చించారు. ఈ ర్యాలీకి రావాలని కేసీఆర్ ని మమతా బెనర్జీ ఆహ్వానించారు. అయితే ఈ ర్యాలీకి వెళ్లకూడదని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పార్టీలు, సీఎంలను మమత ఆహ్వానాలు పంపారు. అయితే మమతా పంపిన ఆహ్వానం సందర్భంగా భాజపా, కాంగ్రెస్ పార్టీలను దూరంగా కేసీఆర్ మరో ఫ్రంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్న సందర్భంగా ఈ ర్యాలీకి తాను దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గోంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దూరంగా ఉండాలనే భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories