పవన్‌తో మాగుంట భేటీ..

పవన్‌తో మాగుంట భేటీ..
x
Highlights

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిశారు. టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని చంద్రబాబుకి తేల్చిచెప్పిన...

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిశారు. టీడీపీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేయనని చంద్రబాబుకి తేల్చిచెప్పిన మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీలో చేరతారంటూ ప్రచారం జరిగింది. అయితే అందరికీ షాకిస్తూ జనసేనాని పవన్ కల్యాణ్‌తో మాగుంట భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా దాదాపు 20 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. అనంతరం మాగుంటని మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ తో కుటుంబ విషయాలు మాట్లాడుకున్నామని తెలిపారు. అయితే వీరిమధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరిగాయన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్ని సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం గరం గరంగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories