లోక్‌సభ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

లోక్‌సభ ఎన్నికలు : ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
x
Highlights

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 979 మంది...

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో విస్తరించిన 59 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 979 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్‌కు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఈస్ట్‌ ఢిల్లీ అభ్యర్థి గౌతం గంభీర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని రాజేందర్‌ నగర్‌లో గంభీర్‌ ఓటువేశారు. ఇటు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి తన ఓటు హక్కును వినియోంచుకున్నారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో విరాట్‌ ఓటువేశారు.భోపాల్‌ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్‌ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories