ఢిల్లీలో ఏపీ నేతల హడావిడి

ఢిల్లీలో ఏపీ నేతల హడావిడి
x
Highlights

ఢిల్లీలో ఏపీ నేతల హడావిడి కనిపిస్తోంది. ఓ వైపు సీఎం చంద్రబాబు, మరోవైపు వైసీపీ నేతలు హస్తినలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీల బృందం...

ఢిల్లీలో ఏపీ నేతల హడావిడి కనిపిస్తోంది. ఓ వైపు సీఎం చంద్రబాబు, మరోవైపు వైసీపీ నేతలు హస్తినలో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీల బృందం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై, కౌంటింగ్ రోజు జాగ్రత్తలపై వినతిపత్రం ఇవ్వనున్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం జాతీయ నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఏపీ భవన్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పాటు చేయబోయే మోడీ వ్యతిరేక కూటమి అంశంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 5 గంటలకు లక్నోలో బీఎస్పీ అధినేత్రి మాయావతితో చంద్రబాబు సమావేశమవుతున్నారు. మొత్తానికి హస్తినలో ఏపీ రాజకీయం రంజుగా మారుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories