వైసీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది: లక్ష్మీ పార్వతి

వైసీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతోంది: లక్ష్మీ పార్వతి
x
Highlights

ఏపీ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని తాజాగా జాతీయ మీడియా సర్వేలు కూడా ఏపీలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందోదని తేల్చిచెప్పాయని వైసీపీ రాష్ట్ర...

ఏపీ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారని తాజాగా జాతీయ మీడియా సర్వేలు కూడా ఏపీలో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందోదని తేల్చిచెప్పాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ మాలాంటి వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కానీ ప్రజలు వాటిని నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. కాగా గతంలో ఏపీ ప్రజలకు ​ఇచ్చిన హామీలనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదని మళ్లీ ఇప్పుడు అబద్దపు హామీలు ఇస్తున్నారని లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇక తాజాగా వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలపై అన్ని వర్గాల ప్రజలు ఒక అవగాహనకు వచ్చారని వైసీపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతోందని లక్ష్మీ పార్వతి జోస్యం చెప్పారు. తనలాంటి ఆడవారిని అడ్డం పెట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారని లక్ష్మీ పార్వతి విమర్శించారు. తన సొంత మామకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories