ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి?: కేటీఆర్‌

ఆంధ్రా పోలీసులకు ఇక్కడ పనేంటి?: కేటీఆర్‌
x
Highlights

ఏపీ ప్రజల డేటా దొంగతనం చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అన్న కేటీఆర్ లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతోనే...

ఏపీ ప్రజల డేటా దొంగతనం చేయకపోతే భయం ఎందుకని ప్రశ్నించారు కేటీఆర్. ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అన్న కేటీఆర్ లోకేశ్వరరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతోనే పోలీసులు సోదాలు చేశారని చెప్పారు. ప్రజల్లో చంద్రబాబు పరపతి తగ్గిపోయిందని, కేసీఆర్‌ను విమర్శిస్తే సానుభూతి వస్తుందని ఆయన అనుకుంటున్నారని విమర్శించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులను ఏపీ సీఎం చంద్రబాబు మోసం చేస్తున్నారని, వారి అనుమతి లేకుండా సమాచారాన్ని ఐటీ కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ హస్తంమేమీ లేదని, ఏపీ ఓటర్ల సమాచారాన్ని టీడీపీ చోరీచేసిందన్న ఫిర్యాదు మేరకే తెలంగాణ పోలీసులు స్పందించారని ఆయన వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories