సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కేటీఆర్‌ భేటీ

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కేటీఆర్‌ భేటీ
x
Highlights

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డిప్యూటీ స్పీకర్‌ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్‌ నుంచి పద్మారావు...

అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవానికి టీఆర్‌ఎస్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డిప్యూటీ స్పీకర్‌ అభ్యర్థిత్వానికి టీఆర్ఎస్‌ నుంచి పద్మారావు గౌడ్‌ ఇవాళ నామినేషన్‌ వేయనున్నారు. అయితే, డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావు గౌడ్‌ ఏకగ్రీవానికి సహకరించాలని టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికపై భట్టి విక్రమార్కతో చర్చించారు. ఈ భేటీకి కేటీఆర్‌తో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, పద్మారావు గౌడ్‌ హాజరయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories