'సోనియా ఆరోగ్యం బాలేకపోయినా ప్రచారం చేయించారు'

సోనియా ఆరోగ్యం బాలేకపోయినా ప్రచారం చేయించారు
x
Highlights

ఇటివల తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ గారీ ఆరోగ్యం సరిగాలేకపోయినా ప్రచారం చేయించారని...

ఇటివల తెలంగాణలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ గారీ ఆరోగ్యం సరిగాలేకపోయినా ప్రచారం చేయించారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారాకరామరావు కాంగ్రెస్ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం రాజన్నసిరిసిల్ల జిల్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రధాని మోడీ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యనేతలు పనిగట్టుకొని టీఆర్ఎస్ పార్టీని ఓడించాలని వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, సంక్షేమ అభివృద్ధిని తెలంగాణ ప్రజలు గెలిపించారని కేటీఆర్ పేర్కొన్నారు. గత 2014లో 34శాతం ప్రజలు ఓటేస్తే 2018 సంవత్సరంలో 44శాతం ఓట్లు వేసి టీఆర్ఎస్ పార్టీకి అధికార పగ్గాలు అప్పగించారని కేటీఆర్ అన్నారు. చరిత్రలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన వారు లేరని కాని ముఖ్యమంత్రి కేసీఆర్ గెలిచారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నాకోసం కష్టపడ్డారు ఇప్పడు మీ కోసం నేను కష్టపడే సమయం వచ్చిందని కేటీఆర్ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories