సొంత పార్టీ నేతలపై కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీ నేతలపై కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ సోషల్...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సీఎం రిలీఫ్‌ ఫండ్‌‌ అందుకున్న వారి నుంచి పార్టీకి చెందిన కొందరు నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా కమీషన్లు అడిగితే వారిని చెప్పుతో కొట్టమంటూ ఆయన ప్రజలకు సూచించారు. శాసనసభ ఎన్నికల్లో తనను ఓడించేందుకు ప్రయత్నించారంటూ కొప్పుల ఆరోపించారు. పార్టీకి చెందిన కొందరు పెద్ద మనుషులు తనను ఓడించేందుకు డబ్బు పంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories