ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఓటు హక్కు వినియోగించుకున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి
x
Highlights

తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్...

తెలంగాణ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ తరపున ఎంపీలుగా పోటీ చేస్తున్న టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోదాడలో ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయవేత్తలు, పలువురు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండాల ప్రభావంతో అక్కడక్కడ పోలింగ్ శాతం స్పల్పంగా తగ్గుతోంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 38.08 శాతం పోలింగ్‌ నమోదైంది. కరీంనగర్‌లో 45.62 శాతం, ఖమ్మంలో 41.62 మహబూబాబాద్‌లో 47.29, వరంగల్‌లో 40.24 శాతం నమోదయింది. సాయంత్రం వరకు పూర్తి పోలింగ్ శాతం వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories