టీడీపీలో చేరిన వైసీపీ మహిళా నేత..

టీడీపీలో చేరిన వైసీపీ మహిళా నేత..
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొల్లి నిర్మల కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే కాగా శనివారం ఏపీ...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొల్లి నిర్మల కుమారి వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే కాగా శనివారం ఏపీ మంత్రి నారా లోకేశ్ స‌మ‌క్షంలో వైసీపీ మ‌హిళా నేత కొల్లి నిర్మ‌లాకుమారి టీడీపీ తీర్థంపుచ్చుకున్నారు. నారా లోకేశ్ టీడీపీ కండువా క‌ప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొల్లి నిర్మ‌లాకుమారి మాట్లాడుతూ వైసీపీలో అవ‌మానాలు భ‌రించ‌లేకే రాజీనామా చేశానని తెలిపారు. ద‌శాబ్ద కాలంగా వైసీపీ కోసం అంకితభావంతో ప‌నిచేశాన‌ు. అయినా నాకు అడుగ‌డుగునా అవ‌మానాలే ఎదుర‌య్యాయి అని అన్నారు. నా ఆత్మ‌గౌర‌వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వ‌ర‌నే ధీమాతోనే టీడీపీలో చేరానని నిర్మ‌లాకుమారి చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories