ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హాట్ కామెంట్స్

ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి కేఈ  కృష్ణమూర్తి హాట్ కామెంట్స్
x
Highlights

ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు. తనకు రెవిన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖను నిర్వహించడమే కష్టంగా మారిదన్నారు. దేవాదాయ శాఖలో...

ఏపీ రెవిన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి హాట్ కామెంట్స్ చేశారు. తనకు రెవిన్యూ శాఖ కంటే దేవాదాయ శాఖను నిర్వహించడమే కష్టంగా మారిదన్నారు. దేవాదాయ శాఖలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడా ఉండవన్న ఆయన ఒక్కోసారి ఈ శాఖ నుంచే తప్పుకోవాలనిపిస్తోందన్నారు. టీటీడీ పరిణామాలపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన ఆయన టీటీడీలోని కొందరు అధికారులు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారన్నారు. ఇదే సమయంలో టీటీడీ అధికారులను దారికి తేవడంలో ప్రభుత్వ పెద్దలకు ఆబ్లిగేషన్స్‌లు ఉన్నాయన్నారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు నియామకం కోసం సీఎం ఫైలు పంపి మూడు నెలలు అయినా ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. అసెంబ్లీ ముగిసిన అనంతరం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేఈ ఈ వ్యాఖ్యాలు చేశారు. అంతకు ముందు అమరావతి పరిధిలో శ్రీ వారి ఆలయ నిర్మాణ భూమి పూజకు కూడా కేఈ హాజరుకాలేదు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరనున్న నేపధ్యంలో కేఈ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్న సమయంలో తాజా కామెంట్స్‌ ఆసక్తికరంగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories