కేసీఆర్ తిరుపతి నుంచి రాగానే గుత్తాకు గుడ్ న్యూస్...

కేసీఆర్ తిరుపతి నుంచి రాగానే గుత్తాకు గుడ్ న్యూస్...
x
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి పర్యటనలో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. నేడు కుటుంబ సమేతంగా కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు....

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుపతి పర్యటనలో ఫుల్ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. నేడు కుటుంబ సమేతంగా కేసీఆర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నేటి సాయంత్రం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరుగుపయనం కానున్నారు. కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే గుత్తా సుఖేందర్ రెడ్డికి శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌కు రేపు చివరిరోజు కావడంతో పార్టీ అధిష్టానం గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ తిరుపతి నుంచి రాగానే సుఖేందర్‌రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. రేపు నామినేషన్లకు చివరిరోజు కావడంతో అందుబాటులో ఉండాలని గుత్తా సుఖేందర్‌రెడ్డికి సీఎంవో నుంచి అధికారులు కాల్ చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories