కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..!

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌..!
x
Highlights

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాధవ్‌ సోమవారం పార్టీ...

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే ఉమేశ్‌ జాధవ్‌ సోమవారం పార్టీ స్వభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కర్ణాటక శాసనసభ స్పీకర్‌కు ఇచ్చారు. కాగా చించోలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉమేశ్‌ జాధవ్‌ త్వరలోనే బీజేపీ పార్టీ తీర్థంపుచ్చుకుంటారు అనే పుకార్లు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 6న కర్ణాటక పర్యటనకు వస్తున్నారని ఆ సందర్భంగా ఉమేష్‌ బీజేపీలో చేరుతారని తెలుస్తోంది. కాగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉమేష్‌ జాదవ్‌ కాలాబురాగి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories