ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో పార్టీ నేతలు ప్రచారంలో ఫుల్ బీజీ అయిపొయారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీలో...
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండంతో పార్టీ నేతలు ప్రచారంలో ఫుల్ బీజీ అయిపొయారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి భారీ షాక్ తగిలింది. జనసేన పార్టీలో ఒక్కసారిగా అస్మతి సెగలు భగ్గుమన్నాయి. జనసేన పార్టీలో కేవలం డబ్బులున్న వారికే మొదటి ప్రధాన్యం ఇస్తున్నారంటూ ఆ పార్టీ కార్యకర్తలు గగ్గోలు పెడుతున్నారు. కడప జిల్లా నాయకుడు మాలే శివ అధ్వర్యంలో బుధవారం దాదాపు 70 మంది సీనియర్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాలే శివ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీలో డబ్బులున్నవారికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టికెట్లు ఇస్తున్నరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప అసెంబ్లీ అభ్యర్థి సుంకర శ్రీనివాస్ తమను చులకనగా చూస్తాన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ నేపథ్యంలో రేపు(గురువారం) ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పర్యటనలో పాల్గొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. మరీ దినిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి!
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire