నాపై చంద్రబాబే అసత్య ప్రచారం చేయిస్తున్నారు: కేఏ పాల్

నాపై చంద్రబాబే అసత్య ప్రచారం చేయిస్తున్నారు: కేఏ పాల్
x
Highlights

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు తనపై విషప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు....

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై క్రైస్తవ మత ప్రచారకుడు కేఏ పాల్‌ మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబు తనపై విషప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌ సీపీని కలిసి ఫిర్యాదు చేసిన కేఏ పాల్‌ తనపై అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం చేయిస్తున్నరన్నారు కేఏపాల్‌‌. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలుస్తానని తెలిపారు. ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో తనపై ఉన్న పాత కేసులను తిరగదోడి ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని పాల్ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories