100 సీట్లు... బాబుకి రిటైర్మంట్.. జగన్‌కు పాల్ ప్రతిపాదన

100 సీట్లు... బాబుకి రిటైర్మంట్.. జగన్‌కు పాల్ ప్రతిపాదన
x
Highlights

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చసాగుతున్న వి‎షయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో...

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ రాజకీయాలపై దేశవ్యాప్తంగా చర్చసాగుతున్న వి‎షయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో కేఏ పాల్ మరోసారి రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న పాల్ ఒక్కసారిగా రూట్ మార్చుకున్నారు. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీకి పార్టీకి 100సీట్లు వస్తాయన్నారు. అయితే ఈ విషయం స్వయంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలోనే తెలిందన్నారు పాల్.

కాగా బాబు ఇప్పటికైన తన మనసు మార్చుకోవాలని హితవు పలికారు. కాగా ఈ నెల 23వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ప్రజలకు అర్ధమవుతుందన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయించేది నేనే అన్నారు పాల్. ఈసారి బాబుకు రిటైర్మంట్ ఇచ్చి మనిద్దరం కలిసి పనిచేద్దామంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాల్ ప్రతిపాదన చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు వైసీపీ అధినేత జగన్ పై దుమ్మెత్తిపోసిన పాల్ ఒక్కసారి యూటర్న్ తీసుకొని జగన్ మోహన్ రెడ్డిపై మొగ్గుచూపడంపై అందరూ షాక్‌కు గురయ్యారు. కేఏ పాల్ కొత్త ప్రతిపాదనపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories