లోక్‌పాల్‌గా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం

లోక్‌పాల్‌గా జస్టిస్‌ పినాకి చంద్ర ఘోష్‌ ప్రమాణ స్వీకారం
x
Highlights

దేశంలోనే తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు....

దేశంలోనే తొలి లోక్‌పాల్‌గా జస్టిస్ పినాకి ఘోష్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ పీసీ ఘోష్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం జరిగింది. లోక్‌పాల్‌ను ఏర్పాటుచేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ జస్టిస్‌ ఘోష్‌ను లోక్‌పాల్‌ చీఫ్‌గా ఎంపిక చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories