టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు : జీవితా రాజశేఖర్‌

టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు : జీవితా రాజశేఖర్‌
x
Highlights

తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని, షర్మిల, లక్ష్మీ పార్వతిలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సినీనటులు జీవితా రాజశేఖర్‌ తీవ్రస్థాయిలో...

తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదని, షర్మిల, లక్ష్మీ పార్వతిలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని సినీనటులు జీవితా రాజశేఖర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు తరుపున అంబాపురం, నైనవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవితా మాట్లాడుతూ మహిళలను గౌరవించలేని టీడీపీ సర్కార్ పసుపు-కుంకుమ పేరుతో మహిళలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్దమయ్యాడని విమర్శించారు. చంద్రబాబుకు మూడుసార్లు అవకాశమిస్తే ఏం చేశాడని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఒక్కసారి అవకాశం ఇవ్వండని ప్రజలను కోరారు. వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇటివలే జీవితా రాజశేఖర్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories