టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ...భీమిలి నుంచి పోటీ?

టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ...భీమిలి నుంచి పోటీ?
x
Highlights

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసనసభకు మాజీ జేడీ పోటీ చేస్తారని...

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసనసభకు మాజీ జేడీ పోటీ చేస్తారని తెలుస్తోంది. తొలుత ఇక్కడి నుంచి మంత్రి లోకేశ్‌ పోటీ చేయాలని భావించినా తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంనుంచి పోటీచేసే యోచన చేస్తున్నట్లు సమాచారం. లక్ష్మీనారాయణ, సీనియర్‌ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీలోకి వచ్చేందుకు సుముఖత చూపారని, రెండు, మూడు రోజుల్లో చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశముందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories