జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్‌!

జేసీ బ్రదర్స్‌కు గట్టి షాక్‌!
x
Highlights

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఆయా పార్టీలలోకి వలసల బాట పడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో తాడిపత్రిలో జేసీ దివాకర్‌...

ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఆయా పార్టీలలోకి వలసల బాట పడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో తాడిపత్రిలో జేసీ దివాకర్‌ రెడ్డి, ప్రభాకర్‌ రెడ్డిలకు భారీ షాక్ తగిలింది. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడిపత్రిలో వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ సమక్షంలో జేసీ బ్రదర్స్‌ ముఖ్య అనచరులు పార్టీలో చేరి ఊహించని గట్టి షాక్‌ ఇచ్చారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గుత్తా వెంకటనాయుడు, జేసీ ముఖ్య అనుచరుడు బోగాతి నారాయణరెడ్డి, సమీప బంధువు జేసీ చిత్తరంజన్ రెడ్డి, తాడిపత్రి టీడీపీ నేతలు జగదీశ్వర్ రెడ్డి, కాకర్ల రంగనాథ్, ఫయాజ్ బాషా, బ్రహ్మనందరెడ్డి, జయచంద్రారెడ్డిలు వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. వీరికి వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories