పసుపు కుంకుమే గెలుపు మంత్రమట

పసుపు కుంకుమే గెలుపు మంత్రమట
x
Highlights

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఏపీ...

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో 50 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు. ఏపీ ఎన్నికల ఖర్చు పది వేల కోట్లు అని తెలిపారు. మళ్లీ టీడీపీయే గెలుస్తుందని, పసుపు కుంకుమే టీడీపీని కాపడుతుందన్నారు. అవినీతి వ్యవస్థపై మేధావులతో కలిసి పోరాటం చేస్తానని జేసీ వెల్లడించారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించాలనేది తన తపన అని వివరించారు. ఇందుకోసం ఓ వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇక ముందు ఎన్నికల్లో ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందని చెప్పారు. డబ్బు కాదు.. చేసిన పనులను ప్రస్తావిస్తూ ఓట్లు అడిగే పరిస్థితి రావాలన్నారు. అందుకోసం కృషి చేస్తానని వివరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories