బాబుకి ఝలక్.. టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మహిళా నేత

బాబుకి ఝలక్.. టీడీపీకి గుడ్ బై చెప్పనున్న మహిళా నేత
x
Highlights

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి...

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల సమరానికి కాలుదువ్వుతున్నాయి. రాజకీయాల్లో వలసలు సర్వసాధారణం. కాగా టీడీపీ పార్టీనేత, సినీనటి జయసుధ టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారు. గురువారం వైసీపీ అధినేత, వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో జయసుధ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీలో చేరిన తర్వాత జయసుధ క్రియాశీల రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కాగా తాను ధీవగంతనేత వైయస్ రాజశేఖర్ రెడ్డి చొరవతోనే రాజకీయాల్లోకి వచ్చానని సన్నిహితుల దగ్గర జయసుధ చెప్పుకొచ్చారు. విజయవాడ లేదా విశాఖపట్నంలోని ఒక స్థానంలో పోటీ చేస్తారని సమాచారం. మొత్తానికి అప్పట్లో కాంగ్రెస్ కండువా, ఆ తరువాత టీడీపీ కండువా ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోబోతున్నారు జయసుధ.

Show Full Article
Print Article
Next Story
More Stories