డబ్బుతోనే రాజకీయం అనే భావనకు చరమగీతం పాడుతా: పవన్

డబ్బుతోనే రాజకీయం అనే భావనకు చరమగీతం పాడుతా: పవన్
x
Highlights

జనసేన కులాలను విడగొట్టే పార్టీ కాదని కులాల ఐక్యత కోసం పాటుపడే పార్టీ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో...

జనసేన కులాలను విడగొట్టే పార్టీ కాదని కులాల ఐక్యత కోసం పాటుపడే పార్టీ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్నికల ప్రచార బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వ్యవస్థ కోసం వ్యక్తిగతంగా వందల కోట్లు నష్టం వచ్చినా బాధపడనని వ్యవస్థ నాశనం అయితే మాత్రం ఊరుకోనన్నారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకు పోతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన సభలో టీడీపీ, వైసీపీ, బీజేపీలను లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కులాల ప్రాతిపదికన చిచ్చుపెట్టి రాజకీయాలను కలుషితం చేశారని, మనుషులను భావజాలం కలపాలేతప్ప కులం కాదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. డబ్బుతోనే రాజకీయం అనే భావనకు చరమగీతం పాడేందుకు జనసేన పార్టీ అవిర్భవించిందని చెప్పారు.

దిగజారిన రాజకీయ వ్యవస్థలో ఆడపడుచులకు రక్షణ లేకుండా పోయిందని, కుల విభేదాలు పెరిగి డబ్బుతోనే రాజకీయం అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. టిడిపి, వైసిపి మాదిరి కోట్లు ఖర్చుపెట్టి రాజకీయం చేసేందుకు తాను రాలేదని, పాలిటిక్స్‌లో మార్పు కోసం వచ్చానన్నారు. అనుభవజ్ఞులు రాష్ట్రానికి మేలు చేస్తారని గత ఎన్నికల్లో టిడిపికి మద్దతిస్తే నిలువునా మోసం చేశారని, బీజేపీ ప్రత్యేక హోదా అంశంలోనూ మోసం చేసిందని విమర్శించారు. ఇక అవినీతి రహిత పాలన అందిస్తామంటున్న జగన్‌ అదే అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారని పవన్ విమర్శించారు. దొంగ ధర్మదీక్షలకు కోట్లు ఖర్చు పెట్టిన టిడిపి ప్రజాసంక్షేమానికి తూట్లు పొడించిందని అన్నారు. జనసేన తెనాలి అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ను, గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి బొనబోయిన శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories