కేసీఆర్, జగన్‌లపై పవన్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్, జగన్‌లపై పవన్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

ఏపీలో ఎన్నికల పొలింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా పార్టీ అధినేతలు ప్రచార స్పీడు పెంచేశారు. మాటల తూటలు పేల్చుతున్నారు. తాజాగా...

ఏపీలో ఎన్నికల పొలింగ్‌కు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. దీంతో ఆయా పార్టీ అధినేతలు ప్రచార స్పీడు పెంచేశారు. మాటల తూటలు పేల్చుతున్నారు. తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలపడంపై జనసేన స్పందించారు. అసలు సీఎం కేసీఆర్ మద్దతు ఇచ్చిన వాళ్లు గెలిచిన దాఖలాలు లేవన్నారు పవన్ కళ్యాణ్. పాలకొల్లు ఎన్నికల ప్రచార సభలో పవన్ మాట్లాడారు. ఇంకో శుభవార్త ఏంటంటే సీఎం కేసీఆర్ మద్దతు చేస్తే ఎవరూ గెలవరు అది ప్రజలు గుర్తుపెట్టుకొండి అది మనకు శుభసూచకం అన్నారు పవన్ కళ్యాణ్. గత 2014లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ మోజార్టీతో విజయం సాధిస్తారని కేసీఆర్ చెప్పారు కానీ ఏం జరిగిందో తెలుసునని గుర్తుచేశారు. అహంకారంతో రెచ్చిపోయిన హిరణ్యకశిపుడు లాంటి వారిని స్తంభం చీల్చుకు వచ్చి మరీ నరసింహుడు సంహరించాడు అంటూ కేసీఆర్, జగన్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాగ్బాణాలు సంధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories