మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడు : పాక్‌ మీడియా

మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడు : పాక్‌ మీడియా
x
Highlights

కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ టెర్రర్ గ్రూపు అధినేత మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిన విషయం...

కరుడుగట్టిన ఉగ్రవాది, జైషే మహ్మద్ టెర్రర్ గ్రూపు అధినేత మౌలానా మసూద్ అజహర్ మృతి చెందినట్టు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిన విషయం తెలిసిందే. జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. అయితే మసూద్ అజహర్ బతికే ఉన్నాడని, ఆయన చనిపోయినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని జైషే మహ్మద్ వర్గాలు తెలిపాయి. మసూద్ అజహర్ ఆరోగ్యంగా ఉన్నాడని ఓ ప్రకటనలో వెల్లడించాయి. మసూద్ అజహర్ రెండు కిడ్నీలు చెడిపోవడంతో రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు కొన్నిరోజుల క్రితమే పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి చెప్పారు. తద్వారా జైషే అధినేత తమ దేశంలోనే ఉన్నాడని పరోక్షంగా అంగీకరించారు. అయితే అజర్‌ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories