గోరంట్ల మాధవ్ పోటీపై వీడని ఉత్కంఠ

గోరంట్ల మాధవ్ పోటీపై వీడని ఉత్కంఠ
x
Highlights

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పోలీస్ శాఖ...

అనంతపురం జిల్లా హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పోలీస్ శాఖ లంచ్ మోచన్ పిటిషన్ వేసింది. రెండు ఛార్జ్ మెమోలు పెండింగ్ లో ఉంటడంతో వీఆర్ఎస్ ఆమోదం తెలుపలేదని వెల్లడించింది. అనంతపురంలో కురబ గర్జన సభలో హడావుడి చేశారంటా ఓ చార్జ్ మెమో.. 2017లో అనంతపురం సీఐగా ఉన్న సమయంలో ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలోపై మరో చార్జ్ మెమో పెండింగ్ లో ఉన్నట్లు ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. ఇప్పటికే హిందూపురం లోక్ సభ స్థానం నుంచి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు గోరంట్ల మాధవ్. వీఆర్ఎస్ తిరస్కరించడంతో ఆయన సతీమణి సబిత పేరుతోను రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories