కేటీఆర్‌కు ట్విట్టర్‌లో లోకేష్‌ కౌంటర్‌

కేటీఆర్‌కు ట్విట్టర్‌లో లోకేష్‌ కౌంటర్‌
x
Highlights

డేటా చోరీ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్‌లో మంత్రి లోకేష్‌ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు....

డేటా చోరీ తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్‌లో మంత్రి లోకేష్‌ టీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్‌లో చేస్తారా అంటూ లోకేష్‌ ట్విటర్‌ వేదికగా ప్రశ్నించారు. వైసీపీ ప్రొడక్షన్‌, టీఆర్ఎస్‌ డైరెక్షన్‌లో టీడీపీ ఏపీ డేటాను దొంగలించారని మంత్రి లోకేష్‌ ఆరోపించారు. కేటీఆర్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌నే వైసీపీ నేతలు చదువుతున్నారన్నారు.

కేసీఆర్, జగన్‌ల జోడి కేటీఆర్ మాటల్లో మరోసారి బయటపడిందని ఏపీ మంత్రి లోకేశ్ ఆరోపించారు. కేటీఆర్ ఇచ్చిన స్క్రిప్టునే వైసీపీ నేతలు చదువుతున్నారని విమర్శించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్‌లో టీడిపీ సభ్యత్వం, సర్వే డేటా దొంగిలించారన్నారు. డేటా చోరీ చరిత్ర అని, బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీ తమదన్నారు. ఎన్నిసార్లు కోర్టు చివాట్లు పెట్టినా బుద్ది రాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్‌లో చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డేటా పోయిందని ఫిర్యాదు వస్తే, ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలని కూడా తెలియదా? అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక ఆంధ్రప్రదేశ్‌లో బలహీనమైన ముఖ్యమంత్రి ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ ఉండదు, ఆటలు సాగుతాయనేది టీఆర్ఎస్ కుట్ర అన్నారు. జగన్ మోదీ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతిపక్ష నేతగా జీతం కావాలి, పోలీసుల నుంచి రక్షణ కావాలి, ప్రజల ఓట్లు కావాలి కానీ ఆయనకు ఏపీ పోలీసులు, డాక్టర్లు, అధికారులు, ప్రజలపై నమ్మకం ఉండదన్నారు. అందుకే తెలంగాణలో ఉంటూ, టీఆర్ఎస్ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories