ఐటీగ్రిడ్‌ అశోక్‌ బెయిలు వ్యాజ్యంపై రేపు హైకోర్టు విచారణ

ఐటీగ్రిడ్‌ అశోక్‌ బెయిలు వ్యాజ్యంపై రేపు హైకోర్టు విచారణ
x
Highlights

ముందస్తు బెయిల్‌ కోసం ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రంగారెడ్డి...

ముందస్తు బెయిల్‌ కోసం ఐటీ గ్రిడ్స్‌ ఎండీ అశోక్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తనను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించగా దాన్ని కోర్టు కొట్టివేసింది. దీంతో ఈ సారి హైకోర్టును ఆశ్రయించారు. అశోక్‌, అతని భార్య శ్రీలక్ష్మీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే అశోక్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆధార్‌, ఓటర్‌, వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించారంటూ ఐటీ గ్రిడ్స్‌ సంస్థపై లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని తమను అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్లలో కోరారు. అయితే ఈ పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories