ఐటీ గ్రిడ్ ఎండీకి హైకోర్టులో చుక్కెదురు

ఐటీ గ్రిడ్ ఎండీకి హైకోర్టులో చుక్కెదురు
x
Highlights

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తమ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తెలంగాణ హైకోర్టును...

డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో తమ ఉద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు తమ అదుపులో ఉన్న ఐటీ గ్రిడ్ నలుగురు ఉద్యోగులను పోలీసులు ఈరోజు హైకోర్టులో హాజరుపరిచారు. తమను పోలీసులు అరెస్ట్ చేయలేదని, విచారణ కోసమే పిలిపించారని వారు న్యాయస్థానంలో చెప్పారు. దీంతో అశోక్ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ ఎండీ దాకవరపు అశోక్‌ కోసం సైబరాబాద్ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఐదు స్పెషల్ టీమ్‌లతో విశాఖపట్నం, విజయవాడ, కావలి, హైదరాబాద్, బెంగళూరులో అతడి కోసం గాలింపు చేపట్టారు. ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా దొంగిలించి దుర్వినియోగం చేస్తోందంటూ లోకేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంస్థపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. నిన్న ఉదయం సంస్థపై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల వేళ డేటా చోరీ కేసు ఏపీతో పాటు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. దీనికి కారణం మీరంటే మీరంటూ అన్ని పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories