మే 14 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

మే 14 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
x
Highlights

ఈనెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయ లక్ష‌్మీ తెలిపారు. 922 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు....

ఈనెల 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయ లక్ష‌్మీ తెలిపారు. 922 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు 4లక్షల 24వేల 500 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. లక్షా 75వేల మంది ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాస్తున్నారని వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ‌్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ‌్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని ఉదయ లక్ష్మీ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories