3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో గౌతమ్ గంభీర్ ఘన విజయం

3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో గౌతమ్ గంభీర్ ఘన విజయం
x
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘన విజయం సాధించాడు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్‌ను అధిష్ఠానం తూర్పు ఢిల్లీ నియోజకవర్గం పార్లమెంట్...

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఘన విజయం సాధించాడు. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన గంభీర్‌ను అధిష్ఠానం తూర్పు ఢిల్లీ నియోజకవర్గం పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలిపింది. ఈ నియోజకవర్గం నుంచి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అర్వీందర్ సింగ్ లవ్లీ పోటీ చేశారు. అర్వీందర్‌ సింగ్‌పై గంభీర్ 3 లక్షల 77 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా గంభీర్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించిన ఆప్ అభ్యర్థి అతిశి మర్లేనా మూడో స్థానానికి పరిమితమయ్యారు.

గంభీర్ తన గురించి అసభ్యకర పదజాలంతో కరపత్రాలను ముద్రించారంటూ అతిశి ఆ కరపత్రాన్ని మీడియా ఎదుట చదువుతూ ఇటీవల కన్నీటి పర్యంతమయ్యారు. తానే ఆ కరపత్రాన్ని ముద్రించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని, లేదంటే మీరు తప్పుకుంటారా? అని గంభీర్ సోషల్ మీడియా వేదికగా సవాల్ విసిరాడు. ఇక ఈ ఎన్నికల్లో గంభీర్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడం పట్ల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories