అమెరికాకు భారత్ షాక్..

అమెరికాకు భారత్ షాక్..
x
Highlights

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంక రహిత ప్రయోజనాలను అమెరికా వెనక్కి తీసుకోవడంతో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆ దేశానికి చెందిన 28...

భారత్ నుంచి ఎగుమతి అవుతున్న ఉత్పత్తులపై సుంక రహిత ప్రయోజనాలను అమెరికా వెనక్కి తీసుకోవడంతో భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఆ దేశానికి చెందిన 28 ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించాలని నిర్ణయించింది. వీటిలో ఆల్మండ్, యాపిల్, వాల్‌నట్ తదితరాలు ఉన్నాయి. అల్యూమినియం, స్టీల్ తదితర వాటిపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేసేందుకు అమెరికా తిరస్కరించడంతో గతేడాది జూన్‌లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 120 శాతం వరకు విధించాలని నిర్ణయించింది.

అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన చర్చలు జరగడంతో ఈ నిర్ణయం అమలు వాయిదా పడుతూ వస్తోంది. 2018 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ 152.1 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక, అమెరికా నుంచి ఆల్మండ్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న తొలి దేశంగా, యాపిల్స్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రెండో దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కాగా, భారత్ తాజా నిర్ణయంతో వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories